Wednesday, 8 November 2017

"టీ- కాఫీ" తాగుతూ లేదా జ్యూస్ తాగుతూ టాబ్లెట్లు మింగకుండ్రి.

చాలామందికి టాబ్లెట్స్ ఎలా వేసుకోవాలో తెలియదు "టీ- కాఫీ" తాగుతూ లేదా జ్యూస్ తాగుతూ కుడా వేసుకుంటారు. ఇలా చేయడం వలన అత్యంత ప్రమాదం అంటుంది భారత వైద్య మండలి .
ముఖ్యంగా పళ్ళరసాలతో కలిపి వేసుకోవడం వలన ప్రమాదం అని అంటున్నారు అసలు ఎలా వేసుకుంటే టాబ్లెట్స్ భాగా పనిచేస్తాయో చూద్దాం..

టాబ్లెట్స్ వీటితోపాటు వేసుకోకూడదు:

>ఉబ్బసం కోసం వాడే మండులలోని గుణాన్ని కాఫీలోని కెఫిన్ దెబ్బతీస్తుంది, కడుపులో మంటను కుడా పెంచుతుంది కాబట్టి కాఫీ తో అస్సలు తీసుకోకూడదు.

>పాలల్లోని కాల్షియం ఆంటిబయాటిక్ మందుల ప్రభావాన్ని తగ్గిస్తుంది కాబట్టి టీ తాగుతూ ఈ మందులు వేసుకోవద్దు

>మామిడిపండు వంటి పీచుతో కూడిన పల్లరసాల వలన  షుగర్, టిబి మందులు పనిచేయవు.

> ద్రాక్షరసం లోని ఎంజైములు గొలీల ప్రభావాన్ని తగ్గిస్తాయి దీనివల్ల గుండెజబ్బులకు ఉపయోగించే మందులు ఆంటి ఎంజైముల వంటి మందులు పనిచేయవు. సైడ్ ఎఫెక్టులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.



టాబ్లెట్లు ఇట్లా వేసుల్కోవాలె:

> చేతులు శుభ్రంగా కడుక్కోవాలే
>చల్లని నీళ్ళు తాగద్దు, గోరువెచ్చ నీళ్ళు తాగాలే
>కాప్సుల్స్ అయితే నమలకుండా మింగాల.

No comments:

Post a Comment